ETV Bharat / bharat

'రైలు టికెట్​పై ప్రతి ప్రయాణికుడికి 55% రాయితీ'- రైల్వే మంత్రి కీలక ప్రకటన

author img

By PTI

Published : Jan 12, 2024, 4:01 PM IST

Updated : Jan 12, 2024, 4:10 PM IST

Railway Ticket Concession : వృద్ధులు​, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్ రాయితీపై రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ పరోక్షంగా స్పందించారు. రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ టికెట్​పై 55శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు.

railway ticket concession
railway ticket concession

Railway Ticket Concession : రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి 55 శాతం రాయితీ లభిస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొవిడ్​కు ముందు సీనియర్ సిటిజన్స్​, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్​పై ఇచ్చిన రాయితీలను పునురుద్ధరణపై మీడియా అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం సమాధానమిచ్చారు.

కొవిడ్​కు ముందు సీనియర్ సిటిజన్స్, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టు​లకు రైలు టికెట్​పై ప్రభుత్వం 50శాతం రాయితీ ఇచ్చేది. 2020 మార్చి 20 తర్వాత దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్​డౌన్ విధించింది. అప్పటి నుంచి వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. లాక్​డౌన్ తర్వాత రైళ్లు నడిచినా ఆ రాయితీలను కేంద్రం పునరుద్ధరించలేదు. అనేకసార్లు రైల్వే రాయితీ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు ప్రశ్నలు లేవనెత్తినా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తటస్థ వైఖరిని ప్రదర్శించారు.

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు రైలు టికెట్​పై రాయితీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా స్పందించారు. ' ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరుకోవడానికి రైలు టికెట్‌కు రూ. 100 ఉంటే, రైల్వే రూ. 45 మాత్రమే వసూలు చేస్తోంది. అంటే ప్రతి ఒక్కరికీ రూ. 55 రాయితీ ఇస్తోంది' అన్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 15కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు టికెట్​పై రాయితీని తొలగించడం వల్ల రైల్వే రూ.2,242కోట్ల లాభపడింది. మధ్యప్రదేశ్​కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి ఆర్​టీఐ కింద దరఖాస్తు చేయగా ఈ విషయం బయటపడింది.

ఆర్​ఏసీ ప్రయాణికులకు బెడ్​ కిట్​
Bed Roll Kit For RAC Passengers In AC Trains : ఇటీవలే రైల్వే ఏసీ కంపార్ట్​మెంట్లలో ప్రయాణించే ఆర్​ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్​ రైల్వే. ఆర్​ఏసీ టికెట్​ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్​ రోల్​ కిట్​ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్​ చెప్పారు. ఈ కిట్​లో ఒక బెడ్​షీట్​, దుప్పటి, టవల్​తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్​ కార్​ ప్రయాణికులకు వర్తించదని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

రైల్వే 'సూపర్‌' యాప్‌ - అన్ని సేవలు ఒకే చోట - ఇకపై టికెట్​ బుకింగ్​కు నో వర్రీస్​!

రైల్వే ఉద్యోగికి ఒకరి కంటే ఎక్కువ భార్యలు- అందరూ పెన్షన్​కు అర్హులే: హైకోర్టు

Last Updated :Jan 12, 2024, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.