ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 33,750 మందికి వైరస్​

author img

By

Published : Jan 3, 2022, 9:33 AM IST

Updated : Jan 3, 2022, 10:29 AM IST

India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 33,750 కేసులు నమోదయ్యాయి. 123 మంది మరణించారు. ఆదివారం 23,30,706 మందికి టీకాలు అందించారు. మరోవైపు ఒమిక్రాన్​ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి.

India covid cases
కరోనా కేసులు

India covid cases: దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24గంటల్లో 33,750 కేసులు వెలుగుచూశాయి. మరో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,846 మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కు చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

  • మొత్తం మరణాలు: 4,81,893
  • యాక్టివ్ కేసులు: 1,45,582
  • కోలుకున్నవారు: 3,42,95,407

omicron cases in india

దేశంలో కరోనా వైరస్​ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య 1700కు పెరిగింది. వారిలో 639 మంది కోలుకున్నారు. దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది.

  • మహారాష్ట్ర- 510
  • దిల్లీ- 351
  • కేరళ- 156
  • గుజరాత్- 136
  • తమిళనాడు- 121

Vaccination in India

దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 23,30,706 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,45,68,89,306 కు చేరింది.

Worldwide covid cases today

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 8 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 2,952 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 1.85 లక్షల కేసులు నమోదయ్యాయి. 162 మంది ప్రాణలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8.47లక్షలకు చేరింది.
  • బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 37 వేల కేసులు నమోదయ్యాయి. 73 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.
  • ఫ్రాన్స్​లో 58,432 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 91 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,942కు చేరింది.
  • ఇటలీలో 61,046 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 133 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 63,28,076కు పెరిగింది. మరణాల సంఖ్య 1,37,646కు చేరుకుంది.
  • టర్కీలో కొత్తగా 33 వేల కేసులు నమోదు అయ్యాయి. 129 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​లో కొత్త ఆంక్షలు:

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్​ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. రాష్ట్రంలో సమావేశాలకు 100 కంటే ఎక్కువ మంది హాజరు కావద్దని స్పష్టం చేసింది. అంతిమ సంస్కారాలకు 20 మంది కంటే ఎక్కువ హాజరుకావద్దని ఆంక్షలు విధించింది. జైపుర్​లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఈ నెల మూడు(సోమవారం)నుంచి తొమ్మిదో తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటింటింది.

ఇదీ చదవండి: Corona Vaccination: పిల్లలకు నేటి నుంచి కొవిడ్‌ టీకా

ఒమిక్రాన్​ ఎఫెక్ట్​- సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Last Updated :Jan 3, 2022, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.