ETV Bharat / bharat

ఒమిక్రాన్​ ఎఫెక్ట్​- సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

author img

By

Published : Jan 2, 2022, 8:52 PM IST

Supreme Court Virtual Hearing: దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ సహా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రెండు వారాలు విచారణలు వర్చువల్​గానే నిర్వహించాలని నిర్ణయించింది.

Supreme Court Virtual Hearing
Supreme Court Virtual Hearing

Supreme Court Virtual Hearing: సుప్రీం కోర్టు కార్యకలాపాలపై మళ్లీ కరోనా ఎఫెక్ట్​ పడింది. దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ సహా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. వర్చువల్​ విచారణలకు సిద్ధమైంది. సోమవారం నుంచి రెండు వారాల పాటు అన్ని కేసుల విచారణలు వర్చువల్​గానే జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.

హైబ్రిడ్​ పద్ధతిలో కోర్టు నిర్వహణకు వీలుగా 2021 అక్టోబర్​ 7న జారీచేసిన ప్రామాణిక నిర్వహణ నిబంధనలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

శీతాకాలం సెలవుల అనంతరం.. సుప్రీం కోర్టు జనవరి 3న తిరిగి తెరుచుకోనుంది.

కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో.. గతేడాది మార్చి నుంచి సుప్రీం కోర్టు విచారణ వీడియో కాన్ఫరెన్స్​లోనే జరిగింది. అక్టోబర్​ 7న మళ్లీ భౌతిక విచారణ ప్రారంభమైంది.

Omicron India: తాజాగా ఒమిక్రాన్​ ఎఫెక్ట్​తో.. మరోసారి వర్చువల్​ పద్ధతిలోనే వాదనలు విననుంది అపెక్స్​ కోర్టు.

ఇవీ చూడండి: లా స్టూడెంట్​ దారుణ హత్య- రాడ్లతో కొట్టి, 14 సార్లు కత్తులతో పొడిచి..

NEET PG Exam: ఈడబ్ల్యూఎస్​ కోటాపై సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.