ETV Bharat / bharat

ఆగస్టు 14 నుంచి రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలు

author img

By

Published : Jul 30, 2020, 4:59 AM IST

Rajasthan Assembly
ఆగస్టు 14 నుంచి రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలు

రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి నిర్వహించేందుకు గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా అనుమతించారు. ఆయన ఆమోదంతో కొద్ది రోజులుగా శాసనసభ సమావేశాలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. మరోవైపు.. అనర్హత నోటీసుల అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు స్పీకర్​.

రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొద్ది రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఆగస్టు 14వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా అనుమతించారు.

రాష్ట్ర మంత్రివర్గ ప్రతిపాదనకు గవర్నర్​ మిశ్రా ఆమోదం తెలిపినట్లు రాజ్​భవన్​ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటిస్తూ.. అన్ని రకాల నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు.

హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకు స్పీకర్​..

అనర్హత నోటీసుపై ఈనెల 24న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు అసెంబ్లీ స్పీకర్​ సీపీ జోషి. కాంగ్రెస్​ రెబల్​ ఎమ్మెల్యేలకు ఇచ్చిన అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించటం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్​లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ ప్రకారం కల్పించిన స్పీకర్​ అధికారాల్లో నేరుగా జోక్యం చేసుకోవటమేనని తెలిపారు. యథాతథ స్థితి కొనసాగించేందుకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదని విన్నవించారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టుకు బీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.