ETV Bharat / bharat

ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టుకు బీఎస్పీ

author img

By

Published : Jul 29, 2020, 2:13 PM IST

రాజస్థాన్​లో బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. కాంగ్రెస్ చర్యను సవాలు చేస్తూ రిట్ దాఖలు చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్​ సింగ్.

RJ-LD-HC-BSP
ఎమ్మెల్యే

రాజస్థాన్​లో తమ ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్​కు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించింది బహుజన్ సమాజ్ పార్టీ. కాంగ్రెస్ చర్యను సవాలు చేస్తూ న్యాయస్థానంలో రిట్ దాఖలు చేసినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ సింగ్ బాబా వెల్లడించారు.

శాసససభ స్పీకర్​ కార్యాలయంలోనూ మరో పిటిషన్ దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు బాబా. ఎమ్మెల్యేల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఫిరాయింపు!

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సందీప్ యాదవ్, వాజిబ్ అలీ, దీప్​చంద్, లఖన్​ మీనా, జోగేంద్ర అవానా, రాజేంద్ర.. బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం 2019 సెప్టెంబర్​లో కాంగ్రెస్​లోకి ఫిరాయించారు.

దిలావర్ పిటిషన్​పై..

ఈ విలీన ప్రక్రియకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే మదన్ దిలావర్​ కూడా హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టు విచారణకు స్వీకరించింది. మార్చిలో చేసిన ఫిర్యాదును స్పీకర్​ తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.