ETV Bharat / bharat

ఔరా: అగ్గిపుల్లలతో అందమైన తాజ్​మహల్​

author img

By

Published : Oct 4, 2020, 2:54 PM IST

గిన్నిస్​ రికార్డు కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. అందులో భాగంగా బంగాల్​కు చెందిన ఓ యువతి.. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్​మహల్​ను రూపొందించింది. అగ్గిపుల్లలతో తయారైన ఈ నమూనా.. రాత్రిపూట కూడా మెరుస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది.

Bengal woman creates Taj Mahal image with over 3 lakh matchsticks
ఔరా! అగ్గిపుల్లలతో అందమైన తాజ్​మహల్​

బంగాల్​లోని నదియాకు చెందిన ఓ యువతి గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో చోటే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా చిన్న చిన్న అగ్గిపుల్లలతో తాజ్​మహల్​ను రూపొందించి ఔరా అనిపిస్తోంది సహేలీ పాల్​​. ఇందుకోసం ఆమె సుమారు 3 లక్షల పుల్లలను వినియోగించిందట. కేవలం రెండు నెలల్లోపే ఈ నమూనాను పూర్తిచేసింది సహేలీ.

6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగిన ఈ తాజ్​మహల్​ తయారీకి రెండు రకాల పుల్లలను ఉపయోగించింది సహేలీ. రాత్రి పూట కూడా మెరిసే విధంగా అందంగా తీర్చిదిద్దింది.

గతంలో 1లక్షా 36వేల అగ్గిపుల్లలతో యునెస్కో నమూనాను రూపొందించి.. ఇరాన్​ వాసి మెయ్​సమ్​ రహ్మానీ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంగా ఈ నమూనా తయారుచేసినట్టు చెప్పింది సహేలీ.

తాతయ్య, నాన్నలే ఆదర్శంగా..

2018లోనూ దుర్గామాత ముఖచిత్రాన్ని సూక్ష్మంగా రూపొందించి రికార్డు సృష్టించింది సహేలీ. మట్టితో తయారుచేసిన ఈ ప్రతిమ కేవలం 2.3 గ్రాములు ఉండటం విశేషం. గతంలో సహేలీ తండ్రి, తాతయ్యలూ ఇలాంటి నమూనాలు తయారు చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందారు. కోల్​కతా విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంఏ ఇంగ్లీష్​ చదువుతున్న సహేలీ.. తాతయ్య, నాన్నలను ఆదర్శంగా తీసుకున్నట్టు చెప్పింది.

ఇదీ చదవండి: సామాజిక కార్యకర్త పుష్పా భావే మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.