బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్​ సూపర్​!

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 10:40 PM IST

thumbnail

Ayodhya Gold Plated Items : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ్​లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామునికి చెందిన వివిధ అంశాలు ప్రతిబింబించే విధంగా బంగారు పూతతో వస్తువులను తయారు చేశారు లఖ్​నవూకు చెందిన ఓ వ్యాపారి. అయోధ్య ఆలయ రూపాన్ని కూడా రూపొందించారు.

"దీనిని 24 క్యారెట్ల బంగారు రేకుతో తీర్చిదిద్దాము. కింది భాగంలో రామ మందిర చిత్రాన్ని ముద్రించాం. ఈ వస్తువులు ప్రజాదరణ పొందాయి. చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోని పూజామందిరంలో ప్రజలు వీటిని పెట్టుకోవచ్చు. ఇందులో రాముని పాదాలతో పాటు ఆస్థానాన్ని తీర్చిదిద్దాం. ఇతరులకు దీనిని బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ వస్తువులపై రాముని పాదాలు, మంత్రాలు కూడా ముద్రించాం" 
- వేదాంశ్ మహేశ్వరి, వ్యాపారి.

బంగారు పూతతో తయారు చేసిన వస్తువులతో పాటు వెండినాణేలు కూడా తయారు చేశారు. ఆ నాణేలపై ఓవైపు రామ్ దర్బార్​, మరో వైపు అయోధ్య ఆలయ చిత్రాలను ముద్రించారు. అయితే వస్తువులన్నింటినీ భక్తులంతా కొనుగోలు చేసే విధంగా తక్కువ ధరల్లోనే విక్రయిస్తున్నట్లు వ్యాపారి తెలిపారు. 250 రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో అమ్ముతున్నట్లు చెప్పారు. వీటన్నింటికీ మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉన్నట్లు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.