నగల వ్యాపారిపై కాల్పులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నం

By

Published : Nov 3, 2022, 8:18 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

ఉత్తరాఖండ్ హల్ద్వానీలో బుధవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. బైక్​పై వచ్చిన ఇద్దరు దొంగలు నగల వ్యాపారి రాజీవ్ వర్మపై కాల్పులు జరిపారు. దుండగుల దాడినుంచి ఎలాగోలా తప్పించుకున్న వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తుతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యాపారి కారుకు బుల్లెట్ తగిలింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేపట్టి తొందరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు సిటీ ఎస్పీ హర్బన్స్ సింగ్. మరోవైపు, రాజస్థాన్ జోధ్​పుర్​లోని ఓషియన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల వ్యాపారిని ఓ వ్యక్తి స్కార్పియోతో ఢీకొట్టాడు. నగల వ్యాపారి బైక్​పై వెళ్తుండగా మధ్యలో ఓ చోట ఆగాడు. ఇది గమనించిన దుండగుడు కావాలనే అతనిని స్కార్పియోతో ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఇది గమనించిన వ్యాపారి తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే వాహనం ఢీకొనడం వల్ల ఒక్కసారిగా ఎగిరిపట్టాడు. ఈ ఘటనలో వ్యాపారి బైక్ ధ్వంసమైంది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.