ETV Bharat / bharat

ఆటోను ఢీకొట్టిన పికప్ వ్యాన్​- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా 8మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 18, 2023, 9:50 AM IST

Updated : Dec 18, 2023, 11:25 AM IST

Pune Road Accident Today : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా 8 మంది మృతి చెందారు. వేగంగా వచ్చిన పికప్​ వ్యాన్ ఆటోను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

Pune Road Accident Today
Pune Road Accident Today

Pune Road Accident Today : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఒక మహిళ సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అహ్మదాబాద్​- కల్యాణ్​ జాతీయ రహదారిపై కల్యాణ్​ వైపు వేగంగా వెళ్తున్న పికప్​ వ్యాన్​, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు, పికప్​ వ్యాన్ డ్రైవర్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పింపాల్‌గావ్ జోగా వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందీ దుర్ఘటన.

ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని స్థానికులతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఓటూరు ఆస్పత్రికి తరలించారు. మృతులను గణేష్ మస్కరే (30), కోమల్ మస్కరే (25 సంవత్సరాలు), హర్షద్ మస్కరే (4), కావ్య మస్కరే (6), నరేష్ నామ్‌దేవ్ దివటే వయస్సు (66- ఆటో డ్రైవర్), అమోల్ ముకుంద తోఖేగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పాఠశాల బస్సు, కారు ఢీ- ఐదుగురు మృతి
Rajasthan Road Accident : రాజస్థాన్​లోని సికార్​ జిల్లాలో పాఠశాల బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను జైపుర్ ఆస్పత్రిలోని తరలించారు. శ్రీమాధోపుర్ చిలవాసి బస్టాండ్​ సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే సుభాష్ మిల్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శ్రీమాధోపుర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను జైపుర్ పర్యటనకు తీసుకెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను అనిల్ జంగిద్, సుభాష్ జంగిద్, బజరంగ్ లాల్​గా గుర్తించారు.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ఆరుగురు మృతి- మరో ఇద్దరు చిన్నారులు

రోడ్డుపై బోల్తా కొట్టిన ట్రక్కు- 25 మంది దుర్మరణం

Last Updated :Dec 18, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.