ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ఆరుగురు మృతి- మరో ఇద్దరు చిన్నారులు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 7:12 AM IST

Updated : Nov 18, 2023, 11:37 AM IST

Jharkhand Road Accident News Today
Jharkhand Road Accident News Today

Jharkhand Road Accident News Today : పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. చెట్టుకు వాహనం ఢీకొని ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఝార్ఖండ్​లో జరిగిందీ ఘటన.

Jharkhand Road Accident News Today : ఝార్ఖండ్​లోని గిరిడీహ్​లో చెట్టును వాహనం బలంగా ఢీకొట్టడం వల్ల ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు సహా మరో నలుగురు గాయపడ్డారు. వారంతా పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బగ్మారా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల బంధువుల్లో ఒకరి నిఖా.. నవంబర్ 17వ తేదీ రాత్రి జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు జరిగింది. అది కూడా అయ్యాక.. మృతులు స్కార్పియోలో తోరియాకు బయలుదేరారు. బగ్మారా ప్రాంతానికి రాగానే డ్రైవర్​.. వాహనంపై నియంత్రణ కోల్పాయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా వాహనం.. చెట్టును ఢీకొట్టింది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.

Five people died in road accident in Giridih Jharkhand
చెట్టును ఢీకొన్న కారు

ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు గమనించి ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులకు సమాచారం అందించారు. వాహనంలో ఉన్న వ్యక్తులను బయటకు తీశారు. ఇంతలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు.

బైక్​ను తప్పించబోయి లోయలో పడ్డ పికప్​ వ్యాన్​- 9 మంది మృతి
Nainital Accident : ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లోయలోకి దూసుకెళ్లింది ఓ పికప్​ వ్యాన్​. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పికప్​ వ్యాన్​ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్-రీతా సాహిబ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. వ్యాన్​ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

Uttarakhand Accident News : అధికారులు వచ్చేలోపు.. గ్రామస్థులే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించి రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఇంతలో అధికారులు వచ్చి గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Last Updated :Nov 18, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.