ETV Bharat / bharat

దేశంలో తగ్గిన యాక్టివ్ కేసులు- భారీగా పెరిగిన రికవరీలు

author img

By

Published : Oct 20, 2020, 1:47 PM IST

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో ప్రస్తుతం 10 శాతం కన్నా తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. రికవరీలు 88.63 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు 1.52 శాతంగా ఉన్నట్లు వివరించింది.

CORONA CASES SLIDE IN INDIA
దేశంలో భారీగా తగ్గుతున్నయాక్టివ్ కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 10 శాతం కన్నా తక్కువ కేసులు మాత్రమే యాక్టివ్​గా ఉన్నట్లు మంగళవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీలు 67 లక్షలకు పెరిగి.. రికవరీ రేటు 88.63శాతానికి చేరినట్లు వివరించింది.

total cases details
మొత్తం కేసుల వివరాలు ఇలా..

దేశంలో ఇఫ్పుడు 7,48,538 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొవిడ్​ కేసుల్లో ప్రస్తుత యాక్టివ్ కేసులు 9.85 శాతం మాత్రమే.

కరోనా నుంచి కోలుకున్నవారు అత్యధికంగా, మరణాల రేటు భారత్​లోనే తక్కువని ఆరోగ్య శాఖ వెల్లడిచింది. దేశంలో కొవిడ్​-19 మరణాల రేటు 1.52 శాతంగా ఉన్నట్లు వివరించింది.

corona recoveries
రికవరీ కేసులు
new cases
కొత్త కేసులు

అత్యల్పంగా కొత్త కేసులు..

కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం నాటికి.. దాదాపు మూడు నెలల తర్వాత 50 వేల కన్నా తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. చివరగా జులై 28న.. తక్కువగా 47,703 కేసులు నమోదవ్వడం గమనార్హం.

ఇదీ చూడండి:దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.