దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 46,791 కేసులు నమోదయ్యాయి. మరో 587మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజులో 69,720మంది కరోనాను జయించారు.
![india-reports-46791-new-number-covid19-cases-and-587deaths-in-last-24-hours](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9240226_c.jpg)
ఆ రాష్ట్రాల్లో...
కరోనా ఉద్ధృతి ఇప్పటివరకు తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులను పరిశీలిస్తే.. యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 8లక్షల కన్నా తక్కువగా ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి:- కొవిడ్ సెంటర్లో గార్బా నృత్యం-వీడియో వైరల్