ETV Bharat / bharat

ఖాలిస్థాన్​ సంస్థ బెదిరింపులపై స్పందించిన ఎన్​ఐఏ

author img

By

Published : Nov 4, 2020, 2:18 PM IST

Updated : Nov 4, 2020, 4:06 PM IST

లండన్​ వెళ్లే విమానాలపై దాడికి దిగుతామని 'జస్టిస్​ ఫర్​ సిక్కు' సంస్థ చేసిన బెదిరింపులపై స్పందించింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఈ మేరకు దిల్లీ పోలీసులు, విమానాశ్రయ సిబ్బందిని అలర్ట్ చేసింది.

justice for sikh
ఖాలిస్తాన్​ సంస్థ బెదిరింపులపై స్పందించిన ఎన్​ఐఏ

ఖాలిస్థాన్​​ సంస్థ చేస్తోన్న బెదిరింపులపై స్పందించిన జాతీయ దర్యాప్తు సంస్థ...దిల్లీ పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో పనిచేసే అధికారులను, సీఐఎస్ఎఫ్ బృందా​లను అలర్ట్​ చేసింది. దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక విజిలెన్స్​ సెల్​ను ఏర్పాటు చేసింది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఖాలిస్థాన్​ సంస్థ బెదిరింపులేంటి?

గురు, శుక్రవారాల్లో దిల్లీ నుంచి లండన్​ వెళ్లే విమానంపై దాడికి పాల్పడుతామని 'జస్టిస్​ ఫర్​ సిక్కు' సంస్థ అధిపతి గుర్పంత్వంత్ సింగ్​ పన్నూ కొన్ని పోస్టర్లు విడుదల చేశారు. ముఖ్యంగా ఎయిరిండియా విమానాల రాకపోకలను అడ్డుకుంటామని అన్నారు.

ఈ బెదిరింపులపై స్పందించిన ఎన్​ఐఏ... దిల్లీ పోలీసులను, విమానాశ్రయ సిబ్బందిని అప్రమత్తం చేసింది.

ఇదీ చదవండి:'ఆ డ్రగ్​తో మధుమేహాన్ని తగ్గించవచ్చు'

Last Updated :Nov 4, 2020, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.