LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం - Minister Kishan Reddy Live

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 4:38 PM IST

Updated : May 1, 2024, 5:12 PM IST

thumbnail

Kishan Reddy Press Meet Live From BJP Party Office BJP Live : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ ప్రచారాల్లో వేగం పెంచాయి. పార్టీలపై విమర్శలకు, ప్రతివిమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పూర్తిగా విఫలయ్యాయని విమర్శిస్తున్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. ఫేక్ వీడియోలతో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి బీజేపీని ఆరోపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుందని చెబుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని అవాస్తవమైన ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు.

Last Updated : May 1, 2024, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.