ETV Bharat / state

టాస్క్​ పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు - రూ.49.45 లక్షలు దోచుకున్నారు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 7:42 PM IST

Investment Fraud in Hyderabad : టాస్క్​లు పూర్తి చేస్తే అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఓ మహిళను నమ్మించారు. విడతల వారీగా రూ.49.45 లక్షలు పెట్టుబడులు పెట్టించి మోసం చేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Investment Cyber Fraud in Hyderabad
Investment Fraud in Hyderabad

Investment Fraud in Hyderabad : పార్ట్​టైం ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్​ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్​లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు పెన్​డ్రైవ్​లు, 7 పాస్​బుక్​లు, 33 చెక్​బుక్​లు, 25 డెబిట్​ కార్డులు, 5సెల్​ ఫోన్​లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పోలీసుల కథనం ప్రకారం : నగరానికి చెందిన ఓ మహిళకు వాట్సాాప్​లో పరిచయం అయిన దుబాయ్​కి చెందిన రైసుల్ ఆమెను టెలిగ్రామ్ యాప్​లోని (Telegram App Scams) ఓ గ్రూప్​లో యాడ్ చేశాడు. అక్కడ క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు. అదే గ్రూప్​లో రైసుల్ అనుచరులు (జానీ, మనువల్​) ఉండి తమకు కూడా లాభాలు వచ్చాయంటూ స్క్రీన్ షాట్లు పెట్టారు. ఇది నిజమేనని నమ్మిన మహిళ అతను చెప్పిన క్రిప్టో ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసింది. అందులో విడతల వారీగా రూ.49.45లక్షలు పెట్టుబడి పెట్టింది.

ఆమె బదిలీ చేసిన నగదును జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాల్లో జమ చేశారు. అనంతరం యాప్ పనిచేయడం ఆగిపోయింది. మోసపోయాయని గుర్తించిన మహిళ సైబర్ క్రైమ్​ (Cyber Crimes) పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు జానీ, మనువల్​ అరెస్ట్ చేశారు. ఖాతాలు సమకూర్చినందుకు రైసుల్ వారిద్దరికీ 3 శాతం కమీషన్ ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దేశ వ్యాప్తంగా జానీ, మనువల్ సమకూర్చిన ఖాతాలు 50కి పైగా సైబర్ నేరాల్లో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.

చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్​ దాడి!

సైబర్ నేరగాళ్ల​​ నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!

Latest Investment Frauds in Telangana : ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో, టెలిగ్రామ్​ గ్రూపుల్లో పార్ట్​ ఉద్యోగం పేరిట ప్రకటనలు వస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించొచ్చన్న ఆశతో ప్రజలు వాటిని ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్నారు సైబర్​ నేరగాళ్లు. ముఖ్యంగా ఇప్పటి కాలంలో పెట్టుబడుల పేరిట అధిక మోసాలు జరుగుతున్నాయి. ముందుగా వ్యక్తిని కాంటాక్ట్​ అవుతారు. వారికి పెట్టుబడి ఎలా పెట్టాలి అని ప్రతి విషయాన్ని సూచిస్తారు. మొదట్లో డబ్బులు బాగానే వస్తాయి. ఆ లాభాలు చూపించి కస్టమర్​ను నమ్మించే ప్రయత్నం చేస్తారు. నమ్మిన తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెట్టించుకుని మోసానికి పాల్పడతారు. తర్వాత వాళ్ల నంబర్ సహా ​అన్ని అందుబాటులో లేకుండా చేస్తారు. ఇలా మోసపోతున్న వారెందరో ఉన్నారు.

పిగ్ బచ్చరింగ్‌ స్కామ్​ తెలుసా - లేదంటే లక్షల్లో దోచుకుంటారు గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.