ETV Bharat / entertainment

టిల్లు గాడి కోసం రంగంలోకి ఎన్టీఆర్​ - 8 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే? - Tillu Square Collections

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 12:57 PM IST

Updated : Apr 6, 2024, 2:13 PM IST

టిల్లు గాడి కోసం రంగంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్​ - 8 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టిల్లు గాడి కోసం రంగంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్​ - 8 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Tillu Square Collections NTR : టిల్లు స్క్వేర్​ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లను కొల్లగొట్టింది. ఈ సందర్భంగా టిల్లు గాడి కోసం యంగ్ టైగర్ రంగంలోకి దిగబోతున్నారు. ఆ వివరాలు.

Tillu Square Collections NTR : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్​తో మరోసారి బాక్సాఫీస్​ను షేక్ చేశారు. డీజే టిల్లు మ్యాజిక్​ను కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నాడు. ఇప్పుడీ చిత్రం వారం రోజుల్లో రూ.100కోట్ల కలెక్షన్లకు దగ్గరగా చేరుకుంది. ప్రస్తుతానికి రూ.96 కోట్లు వసూలు చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్​ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్​ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్​గా రాబోతున్నట్లు తెలిపింది. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. టిల్లు 2 గురింటి ఈవెంట్​లో తారక్‌ ఏం మాట్లాడుతాడోనని అప్పుడే చర్చించుకోవడం మొదలు పెట్టేశారు. నిజానికి తారక్‌కు మూవీటీమ్​ రీసెంట్​గానే సినిమాను చూపించింది. సిద్ధు, విశ్వక్‌ సేన్‌, నాగవంశీతో కలిసి ఎన్టీఆర్ సినిమా చూశారు. అలా అప్పుడే స్మాల్​ హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు దాన్నే నిజం చేశారు.

ఇకపోతే టిల్లు స్క్వేర్​ ఓపెనింగ్ డే కలెక్షన్సే రూ.23 కోట్లు వరకు సాధించి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇందులో సిద్ధు డైలాగ్​లు, ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అలానే అనుపమ పరమేశ్వరన్‌ బోల్డ్ క్యారెక్టర్​ కూడా సినిమాకు మరింత ప్లస్‌ అయింది. అందుకే చిత్రం ఇప్పుడు లాభాల్లో దూసుకెళ్తోంది. సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్​ను నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్ల‌కు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్​ను మా టీవీ సొంతం చేసుకుంది. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ , ఆడియో రైట్స్ రూ.15 కోట్ల వరకు పలికాయట. అంటే ఈ లెక్క‌న కేవ‌లం నాన్ థ్రియాట్రిక‌ల్ రైట్సే రూ.30 కోట్ల వరకు పలికాయని తెలుస్తోంది.

కాగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్​ కలిపి నిర్మించాయి. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలగా వ్యవహరించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతాన్ని అందించారు. మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు.

సుశాంత్ సింగ్​ ఇల్లు కొనుగోలుపై మాట్లాడిన అదా శర్మ - ఏం చెప్పిందంటే? - Adah Sharma

రూ.20 కోట్లతో రూ.200 కోట్ల కలెక్షన్స్​ - బ్లాక్ బస్టర్​ మంజుమ్మ‌ల్ బాయ్స్‌ తెలుగు రివ్యూ - Manjummel Boys Telugu review

Last Updated :Apr 6, 2024, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.