ETV Bharat / entertainment

తలైవా 171 లేటెస్ట్ బజ్- రజనీ సినిమాలో టాలీవుడ్ 'కింగ్'! - Thalaivar 171

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 10:16 AM IST

Updated : Apr 21, 2024, 10:24 AM IST

thalaivar 171
thalaivar 171

Thalaivar 171: రజనీకాంత్ లీడ్​ రోల్​లో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న 'తలైవా 171'పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేటైంది. ఈ సినిమా మల్టీస్టారర్​గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మూవీటీమ్ టాలీవుడ్ స్టార్ హీరోను కన్ఫార్మ్ చేసిందట.

Thalaivar 171: తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్​ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ లోకేశ్​ ఈ సినిమాను గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 'తలైవా 171' వర్కింగ్ టైటిల్​తో సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అయితే ఇటీవల జైలర్​తో బ్లాక్​బస్టర్ సొంతం చేసుకున్న రజనీ, ఈ సక్సెస్ స్ట్రీక్​ను కొనసాగించాలని భావిస్తున్నారు. దీంతో కథ డిమాండ్ మేరకు సినిమాను మల్టీస్టారర్​గా తెరకెక్కించాలని మేకర్స్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో సినిమాలో ఇంకో హీరోగా ఎవరిని ఎంపిక చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను తీసుకోవాలని టీమ్ భావిస్తోందట. ఇందుకోసం మేకర్స్ నాగ్​తో చర్చలు జరిపినట్లు ఇన్​సైడ్ టాక్. ఒకవేళ ఇది నిజమైతే తమిళ్ తలైవాతో టాలీవుడ్ కింగ్​ను బిగ్ స్క్రీన్​పై చూడవచ్చు. ఇది ఇద్దరు హీరోల ఫ్యాన్స్​కు ఫుల్ జోష్ ఇస్తుంది.

అనౌన్స్​మెంట్ అప్పుడే? అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన రజనీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రజనీ రెండు చేతులకు గోల్డ్​ కలర్ వాచ్​లు పెట్టుకొన్ని స్ట్రైలిష్​గా కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా కేవలం పోస్టర్​ విడుదల చేసిన మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. సోమవారం (ఏప్రిల్ 22)నాడు టైటిల్​ అనౌన్స్​మెంట్​ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమాలో మరో హీరో గురించి కూడా ఇందులో రివీల్ చేసే ఛాన్స్ ఉంది!

ఇక ఈ సినిమాకు 'రానా' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారట. ఇందులో రజనీకాంత్ కూతురిగా శ్రుతీహాసన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. సన్​ పిక్చర్స్ బ్యానర్​పై తెరకెక్కుతున్న ఈ మూవీకి మ్యూజిక్ సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు నాగార్జన ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ధనుశ్​తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. 'D51' వర్కింగ్ టైటిల్​తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా, రీసెంట్​గా తిరుపతిలో ఓ షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది.

ఇంట్రెస్టింగ్​గా ధనుష్- శేఖర్ కమ్ముల మూవీ పోస్టర్! నాగార్జునతో లింక్ ఏంటి?

నాగార్జున మూవీ కోసం అలియా భట్ తండ్రి హైడ్రామా - హీరోయిన్​ను చంపేసి!

Last Updated :Apr 21, 2024, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.