తెలంగాణ

telangana

యాదాద్రిలో ఈనెల 19వరకు దర్శనాలు నిలిపివేత

By

Published : Jun 12, 2021, 11:44 AM IST

యాదాద్రిలో ఈనెల 19వరకు దర్శనాలు నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. లాక్​డౌన్​ సడలింపు సమయం ఉదయం 6నుంచి సాయంత్రం 5వరకు ఉండటంతో భక్తులు వైకుంఠద్వారం వద్ద తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.

 Yadadri temple closed for till this month 19th
Yadadri temple closed for till this month 19th

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను నిలిపివేశారు. కొవిడ్​ నియంత్రణలో భాగంగా ఈనెల 19 వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు.

బాలాలయంలో స్వామివారికి ఏకాంతంగా పూజలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ సడలింపు సమయం ఉదయం 6నుంచి సాయంత్రం 5వరకు ఉండటంతో భక్తులు వైకుంఠద్వారం వద్ద తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.

ఇదీ చూడండి:CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ

ABOUT THE AUTHOR

...view details