తెలంగాణ

telangana

బండి సంజయ్​ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు.!

By

Published : Apr 5, 2023, 5:57 PM IST

Police Produced Bandi Sanjay in Court : పదో తరగతి ప్రశ్నపత్రం కేసులో అరెస్టు అయిన బండి సంజయ్​ను పోలీసులు హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు. బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తుండడంతో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించిన పోలీసులు పలు విషయాలు వెల్లడించారు.

Bandi Sanjay
Bandi Sanjay

Police Produced Bandi Sanjay in Court : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో అరెస్టు అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను పోలీసులు హనుమకొండ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో హనుమకొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో బండి సంజయ్​ను పోలీసులు హనుమకొండ కోర్టు వెనుక ద్వారం నుంచి తీసుకెళ్లారు. అంతకుముందు బండి సంజయ్​కు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

పోలీసు వాహనం చెప్పలు విసిరిన దుండగులు :తమను కోర్టులోకి వెళ్లనివ్వాలంటూ సంజయ్ తరఫు లాయర్లు హనుమకొండ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు కోర్టు ప్రాంగణం గేటుకు తాళాలు వేశారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో బండి సంజయ్‌ తరఫు న్యాయవాదులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలకుర్తి నుంచి బండి సంజయ్‌ను కోర్టుకు తరలిస్తున్న పోలీసు వాహనంపై హనుమకొండ కోర్టు చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

బండి సంజయ్​ను ఏ1గా చేర్చిన పోలీసులు :మరోవైపు పదోతరగతి లీక్‌ కేసులో 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్‌ను ఏ1గా చేర్చారు. బీజేపీ అధ్యక్షుడితో పాటు మరో 8 మందిని నిందితులుగా చేర్చినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించేందుకు బండి సంజయ్​ కుట్ర చేశారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 120బి, 420, 447, 505 సెక్షన్ల కింద సంజయ్‌పై కేసులు నమోదు చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 8 పేజీలతో కమలాపూర్ పోలీసులు రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. బండి సంజయ్‌ అనుచరులే పేపర్‌ లీక్‌ చేశారని పోలీసులు తెలిపారు. సంజయ్ ప్రోత్సాహంతోనే పేపర్‌ లీక్‌ జరిగినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారని న్యాయవాది పేర్కొన్నారు. అలాగే సంజయ్​కు ప్రశ్నపత్రం వాట్సప్ చేసిన ప్రశాంత్​ను పోలీసులు ఏ2గా రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేశామన్న పోలీసులు.. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details