తెలంగాణ

telangana

ఓరుగల్లులో కారు జోరు.. అందరూ గులాబీ ఛైర్మన్లే

By

Published : Jun 8, 2019, 7:56 PM IST

వరంగల్  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు ఛైర్మన్ పీఠాలనూ తెరాస దక్కించుకుని.. జిల్లాలో తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించుకుంది.

గండ్ర జ్యోతి

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆరు ఛైర్మన్ పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ ఛైర్మన్​గా మారేపల్లి సుధీర్ కుమార్, వైస్ ఛైర్మన్​గా శ్రీరాములు ఎన్నికయ్యారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​గా గండ్ర జ్యోతిని ఎన్నుకున్నారు. వైస్ ఛైర్మన్ పదవిని ఆకుల శ్రీనివాస్ చేపట్టారు.

ఓరుగల్లులో కారు జోరు

జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా.. పాగాల సంపత్ రెడ్డి, వైస్ ఛైర్మన్​గా గిరబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. మహబూబూబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గా.. ఆంగోతు బిందు, వైస్ ఛైర్మన్ గా.. వెంకటేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ములుగు జిల్లా పరిషత్ పీఠం.. ఏటూరి నాగారం జడ్పీటీసీ కుసుమ జగదీశ్​ని వరించింది. వైస్ ఛైర్మన్​గా.. బడే నాగజ్యోతి ఎన్నికయ్యారు. జయశంకర్ భూపాలపల్లిలో జక్కు శ్రీహర్షిని జిల్లా ఛైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలి పదవి కల్లెపు శోభను వరించింది. ఎన్నిక ముగిసిన వెంటనే తెరాస నేతలు, కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఇవీ చూడండి: 32 జడ్పీ స్థానాల్లో జెండా ఎగురవేసిన తెరాస

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details