తెలంగాణ

telangana

హానికర ఇంజెక్షన్‌ వేసుకుని పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఎంజీఎంలో కలకలం

By

Published : Feb 22, 2023, 5:52 PM IST

PG Medical Student Attempt to Suicide: సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విధుల్లో ఉన్న వైద్య విద్యార్థిని ఆస్పత్రిలో హానికర ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన వరంగల్​లోని ఎంజీఎం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

PG Medical Student Attempt to Suicide
PG Medical Student Attempt to Suicide

PG Medical Student Attempt to Suicide: విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి వేధిస్తున్నాడని ఓ పీజీ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి యత్నించింది. రోజు మాదిరిగానే విధులకు వెళ్లిన వైద్య విద్యార్థిని ఈ రోజు తెల్లవారు జామున ఆస్పత్రిలోనే హానికర ఇంజెక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే బాధితురాలికి చికిత్స అందించడానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్​దాస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం వైద్యవిద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​లోని నిమ్స్​కు తరలించారు. ప్రస్తుతం ఆర్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్​కు చెందిన ప్రీతి అనే వైద్య విద్యార్థి అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఓ సీనియర్ విద్యార్థి తనను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని ప్రీతి తన కుటుంబసభ్యులతోను చెప్పింది. రెండు రోజులు క్రితం మరోసారి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రీతిని వేధించినట్లు సమాచారం. దీనిపై బాధితురాలి ఫిర్యాదు చేయడంతో వేధింపులకు గురిచేసిన సీనియర్ వైద్య విద్యార్థిని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మందలించారు. అయినప్పటికీ ఇవాళ తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కమిషనర్ స్థాయి అధికారితో విచారణ జరిపించాలి : పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై కమిషనర్ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వైద్య వృత్తిలో రాణిస్తున్న గిరిజన విద్యార్థిని వేధించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం విషమం తెలుసుకున్న కొండా సురేఖ హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు తరలించినట్లు వైద్యులు తెలిపినట్లు కొండా సురేఖ వివరించారు. వైద్య వృత్తిలో ఉంటూ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం బాధాకరమని కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు దాడుల సంఖ్య పెరుగుతున్నాయని.. రక్షణ లేకుండా పోయిందని కొండా సురేఖ మండిపడ్డారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details