తెలంగాణ

telangana

అమర జవాన్లకు నివాళులు అర్పించిన విద్యార్థులు

By

Published : Feb 14, 2020, 9:25 PM IST

పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు పలు పాఠశాలల విద్యార్థులు నివాళులు అర్పించారు. వికారాబాద్​ జిల్లా దోమ మండల కేంద్రంలో విద్యార్థులు, గ్రామస్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

students rally in vikarabad
అమర జవాన్లకు నివాళి అర్పించిన విద్యార్థులు

గతేడాది జరిగిన పుల్వామా దాడిలో అసువులు బాసిన సైనికులకు మద్దతుగా వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాతో ప్రాథమిక పాఠశాల నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.

ప్రాణాలు కోల్పోయిన 40 మంది జవాన్లను స్మరిస్తూ... వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అమర జవాన్లకు నివాళి అర్పించిన విద్యార్థులు

ఇదీ చూడండి: 'ప్రతిజన్మలో... నాకు మీరే అమ్మానాన్నలుగా కావాలి'

ABOUT THE AUTHOR

...view details