తెలంగాణ

telangana

300 మందికి నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే

By

Published : May 24, 2021, 12:49 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని 300 మంది కరోనా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆ తర్వాత కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

mla sridhar babu distributed daily commodities
300 మందికి నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండంగా ఉంటుందని అన్నారు. గత పది రోజులుగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండు ఆక్సిజన్ కన్సన్​ట్రేటర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ఈరోజు మంథని మండలంలోని 300 మంది కరోనా బాధితులకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలను పంపిణీ చేశారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అన్నారు. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

TAGGED:

ABOUT THE AUTHOR

...view details