తెలంగాణ

telangana

భాజపా, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయి: శ్రీధర్​బాబు

By

Published : Apr 3, 2021, 3:20 PM IST

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు విమర్శించారు. ప్రజా సంక్షేమంలో రెండు ప్రభుత్వాలూ పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూతపడిన పాఠశాలలను వెంటనే తెరవాలని ఆయన డిమాండ్​ చేశారు.

congress mla sridhar babu
భాజపా, తెరాసలపై ఎమ్మెల్యే ఫైర్​

దిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలతో తెరాస, భాజపాలు ప్రజలను మోసం చేస్తున్నాయని మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్​బాబు పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు శ్రీధర్​బాబును కలిశారు. మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించేలా చూడాలని వినతిపత్రం అందించారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

ప్రజా సంరక్షణలో దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాసలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మెల్యే విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో యువతకు ఏ విధమైన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెరాస ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్​ ఇవ్వలేదన్న ఆయన.. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిని సైతం ఇవ్వడం లేదంటూ దుయ్యబట్టారు.

ఉద్యోగ నోటిఫికేషన్​లు లేకనే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. సునీల్​ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్​ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం హడావిడిగా పాఠశాలలు, కళాశాలలను తెరిపించి, ఎన్నికలు ముగియగానే మూసేయడం బాధాకరమన్నారు. మూతపడిన పాఠశాలలను వెంటనే తెరవాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రైవేటు అధ్యాపకులు ఉపాధి కోల్పోతున్నారని, వారి పరిస్థితి గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.

ఇదీ చూడండి: ఇళ్లైనా, పెళ్లైనా తెరాసతోనే సాధ్యం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details