తెలంగాణ

telangana

పరిహారం కోసం రైతుల కలెక్టరేట్​ ముట్టడి

By

Published : Mar 1, 2021, 3:33 PM IST

తమకు పరిహారం చెల్లించాలని కోరుతూ నిర్మల్ జిల్లా పాన్కల్ రైతులు కలెక్టరేట్​ను ముట్టడించారు. రైతుల ఆందోళనకు భాజపా మద్దతు తెలిపింది.

farmers protest in front of electorate in nirmal district
పరిహారం కోసం రైతుల కలెక్టరేట్​ ముట్టడి

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పాన్కల్ గ్రామ సమీపంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సదర్ మాట్ బ్యారేజీలో భూములు కోల్పోయిన రైతులు.. పరిహారం కోసం కలెక్టరేట్​ను ముట్టడించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.

రైతులు చేస్తున్న ఆందోళనకు భాజపా నాయకులు మద్దతు తెలిపారు. గత మూడేళ్లుగా పరిహారం ఇస్తామని చెబుతున్నారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదని నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి అన్నారు. పరిహారం చెల్లించే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మల్లన్నసాగర్​లో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చినట్లు పొన్కల్ బ్యారేజీ భూ నిర్వాసితులకు డబుల్​బెడ్ రూమ్ ఇల్లు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:'పోలీసుల నిర్లక్ష్యం వల్లే వామన్రా​వు దంపతుల హత్య'

ABOUT THE AUTHOR

...view details