తెలంగాణ

telangana

కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్

By

Published : Jan 12, 2021, 10:41 PM IST

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ కమిటీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.

MLA Ramulu Nayak inaugurated the state level kabaddi competitions in Khammam district.
కబడ్డీ పోటీలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే రాములు నాయక్

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురంలో.. ఎమ్మెల్యే రాములు నాయక్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంజనాపురం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో పాల్గొనేందుకు.. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.

స్నేహ భావం పెరుగుతుంది

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే.. క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రీడలతో స్నేహ భావం పెరుగుతుందని తెలిపారు.

ఇదీ చదవండి:గల్ఫ్​ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి : వినోద్

ABOUT THE AUTHOR

...view details