తెలంగాణ

telangana

పశుసంవర్ధక శాఖలో నిధుల గోల్‌మాల్‌ కేసు ఏసీబీకి బదిలీ- ఓఎస్డీ కల్యాణ్​ సహా పలువురిపై కేసు నమోదు

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 1:38 PM IST

Updated : Jan 16, 2024, 3:59 PM IST

Telangana Sheep Scam ACB Inquiry 2024 : తెలంగాణ పశుసంవర్థక శాఖలో నిధుల గోల్‌మాల్‌ కేసును అవినీతి నిరోధక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో నిధులను బినామీలకు తరలించిన ఫిర్యాదుపై అధికారులు దృష్టి సారించారు. ఓఎస్‌డీ కల్యాణ్‌తో పాటు సయ్యద్ మోయీద్ అనే కాంట్రాక్టర్, మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్ మరికొందరిపై కేసు నమోదు చేశారు.

Animal Husbandry Scam
Telangana Animal Husbandry Scam

Telangana Sheep Scam ACB Inquiry 2024 : పశుసంవర్దక శాఖలో గొర్రెల పంపిణీ గోల్‌మాల్‌ కేసును పోలీసులు ఉన్నతాధికారులు అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేశారు. గొర్రెల పంపిణీ పథకం(Sheep Distribution) పేరిట అధికారులు రైతులను మోసం చేశారని బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కోసం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వేర్వేరు రాష్ట్రాల నుంచి గొర్రెపిల్లలు సేకరించి ఉచితంగా పంపిణీ చేస్తోంది.

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాల సోదాలు

"లోలో నా ది లైవ్ స్టాక్ కంపెనీ" నిర్వహిస్తున్న సయ్యద్ మోయీద్ అనే కాంట్రాక్టర్​తో కలిసి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్ గత ఏడాది ఆగస్టులో ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతుల వద్ద గొర్రె పిల్లలు పరిశీలించారు. 20 గొర్రెలు,1 పొట్టేలు కలిపి ఒక యూనిట్​గా మొత్తం 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు కొనుగోలు చేశారు.

Telangana Sheep Distribution Scam : అనంతరం రైతుల ఆధార్​కార్డు, పాన్​కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్లను పశుసంవర్ధకశాఖ అధికారులు సేకరించి ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేసి నేరుగా రైతుల అకౌంట్​లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా, అధికారులు చేయాల్సిన పని కాంట్రాక్టర్ సయ్యద్ మోయీదకు అప్పగించారు. దీంతో అతను రైతుల స్థానంలో తమ బినామీల బ్యాంక్ అకౌంట్ నంబర్లను ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేశారు. దీంతో పశుసంవర్ధకశాఖ నుంచి డబ్బులు నేరుగా బినామీ ఖాతాల్లో పడ్డాయి.

అప్పటిదాక కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు - రేవంత్ సర్కార్ ఆదేశాలు

దాదాపు రెండు కోట్ల పైగా నగదును అధికారులు, కాంట్రాక్టర్​తో చేతులు కలిసి తప్పుడు ఖాతాలోకి బదిలీ చేసుకున్నారని బాధితులు పిర్యాదులో పేర్కోన్నారు. గొర్రెపిల్లలు తీసుకెళ్లి నెలలు గడుస్తున్నా తమ అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో అనుమానంతో రైతులు కొండాపూర్లో ఉన్న సయ్యద్ మోయీద్ కార్యాలయానికి వచ్చి నిలదేశారు. ప్రభుత్వం నుంచి డబ్బు విడుదల కాలేదని మాయమాటలు చెప్పాడు.

దీంతో రైతులు పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి విచారించగా, తమకు రావాల్సిన డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలుసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 20న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్​తో పాటు ప్రభుత్వ అధికారులు ఏడేలు రవికుమార్, కేశవ్​ సాయిపై కేసు నమోదు చేశారు. ఇదే కాంట్రాక్టర్ గతంలో పొంగనూరు రైతుల వద్ద ఆవులు కొనుగోలు చేసి వారిని సైతం మోసం చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది : మంత్రి ఉత్తమ్‌ కుమార్

Last Updated : Jan 16, 2024, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details