ETV Bharat / state

అప్పటిదాక కాళేశ్వరం తుది బిల్లులు చెల్లించొద్దు - రేవంత్ సర్కార్ ఆదేశాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 8:00 AM IST

Kaleshwaram Project Issue : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులు చేపట్టిన సంస్థల తుది బిల్లులు చెల్లించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతానికి ఆ బిల్లులను పెండింగ్‌లో పెట్టాలన్న సర్కార్, నీటిపారుదల శాఖపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ఏయే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలో నిర్ణయించిన తర్వాత చెల్లింపులపై ముందుకెళ్లనున్నట్లు తెలిసింది.

Kaleshwaram Project Issue
Kaleshwaram Project Issue

కాళేశ్వరం తుది బిల్లులు పెండింగ్‌లో పెట్టాలన్న సర్కార్

Kaleshwaram Project Issue : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (Kaleshwaram project) మొదటి లింకులో ఉన్న మూడు బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్‌లో పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగడంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సమస్యలున్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు పేర్కొనడం, మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాదం నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. తుది బిల్లులు చెల్లించేందుకు సంబంధిత ఇంజినీర్లు సిఫార్సు చేయడంతోపాటు, అందుకు సబంధించిగుత్తేదారుకు ధ్రువీకరణ ఇస్తారు.

Kaleshwaram Final Bills Pending 2024 : మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పనిచేసిన ఎల్‌అండ్‌టీ సంస్థకు సుమారు రూ.400 కోట్ల వరకు తుది బిల్లు చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నారం ఆనకట్టకు పనిచేసిన అప్కాన్స్‌ సంస్థకి రూ.161 కోట్ల తుది బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీ పనిచేసిన, నవయుగ సంస్థకి పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. 2022లో వరదలకి అన్నారం పంపుహౌస్‌ వరదలకు నీట మునిగాక, మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కాంక్రీట్‌వాల్‌ నిర్మాణం చేపట్టారు. సుమారు 90 శాతానికిపైగా పూర్తైన ఆ పనికి మేఘా ఇంజినీరింగ్‌కు చెల్లించాల్సిన రూ.74 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

కాళేశ్వరం 3 బ్యారేజీల్లోని నీళ్లన్నీ ఖాళీ చేయాల్సిందే! : నీటిపారుదల శాఖ

పెండింగ్ బిల్లులు భారీగా : పునరుద్ధరణ పనులపై అంతిమ నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మూడు బ్యారేజీలకు సంబంధించిన, తుది బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. నీటిపారుదలశాఖలో గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణకి కలిపి రూ.10,000ల కోట్ల వరకు రోడ్లు-భవనాలు సహా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

సమీక్ష తర్వాతనే బిల్లుల చెల్లింపు : నీటిపారుదలశాఖపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి, ఏ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయాలో నిర్ణయించిన తర్వాత బిల్లుల చెల్లింపులపై ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. పెద్ద మొత్తాల బిల్లులు పెండింగ్‌లో పెట్టి, చిన్న కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సిన మొత్తాన్ని తొలుత చెల్లించాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. నీటిపారుదల, రోడ్లు-భవనాలతో సహా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల బిల్లులు పెండింగ్‌లోపెట్టి ప్రాధాన్యాలు నిర్ణయించాకే చెల్లింపులపై ముందుకెళ్లాలనియోచిస్తున్నట్టు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

చిన్న మొత్తానికే తొలి ప్రాధాన్యమివ్వాలన్న ముఖ్యమంత్రి : పంచాయతీరాజ్‌తో సహా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లో, చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం ఎక్కువమంది ఎదురుచూస్తున్నారని వారికి ప్రాధాన్యమిచ్చి చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.600 కోట్లు చెల్లిస్తే అలాంటి 7500 మందికి ఊరట లభిస్తుందని ఆర్థికశాఖ నివేదించినట్లు సమాచారం. సంక్రాంతిలోగానే ఆ మొత్తం చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాళేశ్వరానికి అసలేమైంది, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు

మేడిగడ్డపై అధికారుల దృష్టి, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.