తెలంగాణ

telangana

Telangana HC on Transgender Admission in PG : 'అర్హత ఉన్నా.. ఆ ట్రాన్స్‌జెండర్‌కు ప్రవేశం ఎందుకు కల్పించలేదు..?'

By

Published : Jun 20, 2023, 10:04 AM IST

Updated : Jun 20, 2023, 10:18 AM IST

Telangana High Court on PG Medical Seats : పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్‌ కోటా కింద ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్‌ పొందేందుకు అర్హత ఉన్నా.. సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే థర్డ్‌ జెండర్‌ వారి పట్ల దయతో కాకుండా.. వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

High Court on PG Medical Seats
High Court on PG Medical Seats

Telangana HC on PG Medical Seat Allotment to Transgender: ట్రాన్స్‌జెండర్‌ రిజర్వేషన్‌ కోటా కింద పీజీ వైద్య విద్యలో తనకు సీటు ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ డాక్టర్‌ కొయ్యల రూత్‌జాన్‌పాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం 2023 నీట్‌ పీజీలో పొందిన మార్కుల ప్రకారం పిటిషనర్‌ డాక్టర్‌ కొయ్యల రూత్‌జాన్‌పాల్‌ అడ్మిషన్‌ పొందడానికి అర్హత ఉన్నా.. సీటు ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్‌ఎంసీ (జాతీయ వైద్య కమిషన్‌), రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

High Court on PG Medical Seats Allotment : ఈ క్రమంలోనే థర్డ్‌ జెండర్‌ వారి పట్ల దయతో కాకుండా.. వారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం.. ఎస్సీ, ఓబీసీ కోటాలో ప్రవేశాలు పొందిన చివరి అభ్యర్థులు నీట్‌ పీజీ-2023లో పొందిన మార్కుల వివరాలనూ సమర్పించాలని జాతీయ వైద్య కమిషన్‌ను ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూసిన నీట్‌ యూజీ ఫలితాలు గత వారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. ఏపీ విద్యార్థి బోర వరుణ్‌ చక్రవర్తి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రభంజన్‌ 99.99 పర్సంటైల్‌తో తొలి ర్యాంకు సాధించారు. నీట్​కు అర్హత సాధించిన వారిలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, యూపీ, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు ఎన్‌టీఏ తెలిపింది.

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నీట్‌కు మొత్తం 11 లక్షల 45 వేల 976 మంది అర్హత సాధించారు. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 42 వేల 836 మంది, తెలంగాణ నుంచి 42 వేల 654 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కె.జి.రఘురాం రెడ్డి అనే అభ్యర్థి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. EWS కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎల్ ప్రవధాన్ రెడ్డి, ఎస్సీ కేటగిరీలో అదే రాష్ట్రానికి చెందిన విద్యార్థి కె.యశశ్రీకి వరుసగా తొలి, రెండో ర్యాంకులు సొంతం చేసుకున్నారు.

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌ 4న ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని విడుదల చేసి.. జూన్‌ 6 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్​టీఏ అధికారులు.. జూన్‌ 13న ఫలితాలను విడుదల చేశారు.

ఇవీ చూడండి..

NEET Results 2023: నీట్​ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థికి ఫస్ట్​ ర్యాంక్​

వైద్య చరిత్రలోనే అద్భుతం.. 13 నెలల చిన్నారి కిడ్నీలను 30 ఏళ్ల వ్యక్తికి అమర్చిన వైద్యులు..

Last Updated :Jun 20, 2023, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details