రాష్ట్రంలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,61,201కి చేరింది. తాజాగా వైరస్తో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,895కు పెరిగింది. కొవిడ్ నుంచి మరో 313 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 6,52,398కు చేరింది.
TS CORONA CASES: కొత్తగా 249 కరోనా కేసులు.. 2 మరణాలు
తెలంగాణలో కొత్తగా 249 మందికి కరోనా సోకింది. వైరస్ సోకి మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
TS CORONA CASES: కొత్తగా 249 కరోనా కేసులు.. 2 మరణాలు
తెలంగాణలో ప్రస్తుతం 5,258 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వారిలో కొందరు హోం ఐసోలేషన్లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ 53,789 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది.
ఇదీ చూడండి: Corona Vaccine: ఆంధ్రాలో చనిపోయిన వ్యక్తికి కరోనా వ్యాక్సిన్!