తెలంగాణ

telangana

కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన అందరికీ ధన్యవాదాలు : రేవంత్ ​రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 4:11 PM IST

Revanth Reddy Special Thanks to Congress Activists : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 'మీ కష్టం, మీ శ్రమ వృథా కావు' అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ (ట్విటర్) వేదికగా స్పందించారు.

Revanth Reddy
Revanth Reddy Special Thanks to Congress Activists

Revanth Reddy Special Thanks to Congress Activists :తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. ఇక తుది తీర్పే తరువాయి. డిసెంబరు మూడో తేదీన ప్రజా తీర్పు వెలువడనుంది. ఈ క్రమంలో అన్ని ఎగ్జిట్​ పోల్స్(Exit Polls 2023)​ సర్వేలు రాష్ట్రంలో అధికారం దక్కించుకునేది.. కాంగ్రెస్​ పార్టీనే అని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ​రెడ్డి ఎక్స్(ట్విటర్)​ వేదికగా కాంగ్రెస్​ శ్రేణులను ఉద్దేశిస్తూ.. ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరుపేరున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) ఎక్స్​(ట్విటర్​)లో ధన్యవాదాలు తెలిపారు. గడిచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్​ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని అభినందించారు.

Telangana Election Polls 2023 :మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిదని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ ఎక్స్​ వేదికగా రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. అలాగే గురువారం జరిగిన సమావేశంలో ఏ ఎగ్జిట్​ పోల్​ చూసినా తెలంగాణలో కాంగ్రెస్​దే అధికారం అని చెబుతున్నాయని చెప్పారు.

"ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది. ప్రతి ఒక్కరికీ అభినందనలు."- రేవంత్​ రెడ్డి ట్వీట్​

ఏ ఎగ్జిట్‌ పోల్‌ చూసినా తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం : రేవంత్‌రెడ్డి

రేవంత్​రెడ్డిని కలిసిన కాంగ్రెస్​ నేతలు :మరోవైపు జూబ్లీహిల్స్(Jubilee hills)​లోని రేవంత్​రెడ్డి నివాసం వద్ద.. కాంగ్రెస్​ నేతలు సందడి చేస్తున్నారు. ఆయనను కలవడానికి పోటీ చేసిన అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఏ.చంద్రశేఖర్​, మల్​రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్​ మొదలగు నాయకులు ఆయన నివాసానికి వచ్చారు. తమ తమ నియోజకవర్గాల్లో జరిగిన ఓటింగ్​ సరళిపై రేవంత్ ​రెడ్డితో కాసేపు చర్చించారు. టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైతం రేవంత్​ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఎగ్జిట్​ పోల్స్​ ఎప్పుడూ అంతే - అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి : కేటీఆర్

తెలంగాణలో ఛాలెంజ్​ ఓటు వేసిన ఒక్కమగాడు - ఎక్కడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details