తెలంగాణ

telangana

Telangana Corona: రాష్ట్రంలో 4 వేలు దాటిన కరోనా కేసులు

By

Published : Jan 20, 2022, 7:27 PM IST

Updated : Jan 20, 2022, 8:00 PM IST

Telangana Corona: రాష్ట్రంలో 4 వేలు దాటిన కరోనా కేసులు
Telangana Corona: రాష్ట్రంలో 4 వేలు దాటిన కరోనా కేసులు

19:24 January 20

Telangana Corona: రాష్ట్రంలో 4 వేలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో 4 వేలు దాటిన కరోనా కేసులు

Telangana Corona: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇవాళ గరిష్ఠ స్థాయిలో కరోనా కేసుల సంఖ్య నమోదైంది. ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా 4207 మందికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి వరకు 7,22,403 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఈరోజు 1825 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,91,703 మంది రికవరీ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4067కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26,633 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1645 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా..

తాజాగా నమోదైన కేసుల్లో ఆదిలాబాద్ 32, కొత్తగూడెం 91, జగిత్యాల 49, జనగామ 30, జయశంకర్ భూపాలపల్లి 30, జోగులాంబ గద్వాల 33, కామారెడ్డి 33, కరీంనగర్ 84, ఖమ్మం 98, కుమురంభీం ఆసిఫాబాద్ 34, మహబూబ్ నగర్ 81, మహబూబాబాద్ 63, మంచిర్యాల 80, మెదక్ 45, మేడ్చల్ మల్కాజిగిరి 380, ములుగు 22, నాగర్​కర్నూల్ 52, నల్గొండ 84, నారాయణపేట 28, నిర్మల్ 36, నిజామాబాద్ 74, పెద్దపల్లి 87, రాజన్న సిరిసిల్ల 36, రంగారెడ్డి 336, సంగారెడ్డి 107, సిద్దిపేట 70, సూర్యాపేట 52, వికారాబాద్ 86, వనపర్తి 48, వరంగల్ రూరల్ 49, హన్మకొండ 154, యాదాద్రి భువనగిరి 78 చొప్పున కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చదవండి:

Last Updated :Jan 20, 2022, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details