'జనతా గ్యారేజ్' తర్వాత మరోసారి జూనియర్ ఎన్టీఆర్, మోహన్లాల్ కలిసి నటించనున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో వీరిద్దరూ కలిసి తెరపై కనువిందు చేయనున్నారని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తి చేశారని తెలుస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మోహన్లాల్, ఎన్టీఆర్!
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, యంగ్టైగర్ ఎన్టీఆర్ కలిసి మరోసారి తెర పంచుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వీరిద్దరూ కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మోహల్లాల్, ఎన్టీఆర్!
'అల వైకుంఠపురములో' విడుదల తర్వాత నుంచి త్రివిక్రమ్.. ఎన్టీఆర్ చిత్రంపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే చిత్రం కోసం రంగంలోకి దిగుతారు. ఎన్టీఆర్ నటించబోయే 30వ చిత్రమిది. ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Last Updated :Aug 18, 2020, 10:27 AM IST