లారీ, అంబులెన్స్ ఢీ - మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధం - 108 Ambulance Vehicle Hit a Lorry

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 4:31 PM IST

thumbnail
లారీ, అంబులెన్స్ ఢీ - మంటలు చెలరేగి రెండు వాహనాలు (ETV Bharat)

108 Ambulance Vehicle Hit A Lorry : లారీని 108 అంబులెన్స్ ఢీకొనడంతో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం నీలంనగర్‌ స్టేజీ వద్ద కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పీఏపల్లికి చెందిన 108 అంబులెన్స్‌ వాహనం హైదరాబాద్‌కు వెళ్లి మరమ్మతులు చేసుకొని వస్తోంది. ఈ క్రమంలో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.  

ఈ ప్రమాదంలో అంబులెన్స్‌, లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. అంబులెన్స్‌ డ్రైవర్‌ శేఖర్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకుని సహాయకచర్యలు చేపట్టారు. కొద్ది రోజుల క్రితం ఇలాంటి ఘటనే హైదరాబాద్​లో జరిగింది. ఎన్టీఆర్ ఘాట్ వైపు వెళ్తున్న హోండాసిటీ కారుతో పాటు మరో ద్విచక్ర వాహనాన్ని లక్డీకపూల్ నుంచి ట్యాంక్​బండ్ వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.