తెలంగాణ

telangana

గొడవలతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య

By

Published : Nov 2, 2020, 8:35 PM IST

దంపతుల మధ్య జరిగిన గొడవ.. భర్త ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మాలిపురంలో చోటుచేసుకుంది. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్​లో ఉంటున్న దుర్గయ్య, అనిత దంపతులు తరచూ ఘర్షణ పడేవారు. దీంతో విసిగి చెంది.. మనస్తాపానికి గురైన దుర్గయ్య తన సొంతూరి శివారులో ఉరి వేసుకుని చనిపోయాడు.

గొడవలతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య
గొడవలతో మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య

భార్యా భర్తల గొడవ.. భర్త ఆత్మహత్యకు దారితీసింది. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురానికి చెందిన అమనగంటి దుర్గయ్యకి నాగరం మండలానికి చెందిన అనితతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్​లో ఉంటున్నారు.

గతకొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరగడం వల్ల మనస్తాపం చెందిన దుర్గయ్య.. మాలిపురం శివారులోని వ్యవసాయ భూమి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డానియల్​ తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి:మొదటి రాత్రే భార్యను చంపి భర్త ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details