తెలంగాణ

telangana

'కరోనా మాస్కుల వార్తలు అవాస్తవం... భయపడకండి'

By

Published : Dec 15, 2020, 4:23 AM IST

Updated : Dec 15, 2020, 7:51 AM IST

మాస్కుల ఉచిత పంపిణీపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలపై రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ స్పందించారు. ప్రజలను కరోనా వైరస్​తో చంపేందుకు ఉచితంగా మాస్కులు పంచుతున్నారని వస్తున్న వార్తలను సీపీ ఖండించారు. అవన్నీ అవాస్తవమని... ఎవరూ నమ్మొద్దని సూచించారు.

rachakonda-cp-mahesh-bhagavath-on-mask-distribution
'కరోనా మాస్కుల వార్తలు అవాస్తవం... భయపడకండి'

ప్రజలను కరోనా వైరస్​తో చంపేందుకు ఉచితంగా మాస్కులు పంచుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దని రాచకొండ కమిషనర్​ మహేశ్​ భగవత్​ సుచించారు. సామాజిక మాధ్యమాల్లో ఆడియో క్లిప్​లను పోస్ట్ చేస్తున్నారని... అవన్నీ అవాస్తవమని తెలిపారు.

ప్రజలు ఇలాంటి అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రజలను భయాందోళనకు గురి చేసే వార్తలు ప్రచారం చేసినా.. షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్​ భగవత్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి: ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు

Last Updated :Dec 15, 2020, 7:51 AM IST

ABOUT THE AUTHOR

...view details