తెలంగాణ

telangana

భూతాపం 3 డిగ్రీలకు పెరిగితే పరిస్థితి ఏంటి? వినాశనమేనా?

By

Published : Nov 3, 2021, 1:01 PM IST

భూతాపం వల్ల ఎన్నో విపత్కర పరిస్థితులు (Effects of Global Warming) ఏర్పడుతున్నాయి. హిమానీనదాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అకాల వర్షాలు, వరదలు, కార్చిచ్చులు, సునామీలు (Global Warming Projections) విధ్వంసం సృష్టిస్తున్నాయి. మరి ఇప్పుడే ఇలా ఉంటే.. భూతాపం 3 డిగ్రీలకు పెరిగితే? అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? మానవులు మనుగడ సాధించే అవకాశం ఉంటుందా?

CLIMATE WARMING 3 DEGREES
CLIMATE WARMING 3 DEGREES

భూతాపాన్ని పారిశ్రామిక విప్లవం కంటే ముందున్న 1.5 డిగ్రీల స్థాయికి పరిమితం చేయాలని పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాతావరణ మార్పులను కట్టడి చేసేలా ఈమేరకు అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సమావేశం(కాప్26)లో పర్యావరణం అంశంపైనే దేశాలు చర్చలు జరుపుతున్నాయి.

ఈ వాతావరణ సదస్సులు నిర్వహిస్తున్నప్పుడల్లా మనకు వినిపించేది ఒకటే.. భూతాపాన్ని 1.5 డిగ్రీల స్థాయికి పరమితం చేయడం అని. అంటే పుడమి సగటు ఉష్ణోగ్రతను నిర్దేశిత లక్ష్యాన్ని మించకుండా చూడటం. 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే.. పరిణామాలు (Global Warming Impact) అత్యంత తీవ్రంగా ఉంటాయి. అకాల వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, భీకర వరదలు, మంచు కరగి సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి అంశాలన్నీ భూతాపానికి (Global Warming Impact) ముడిపడి ఉన్నాయి.

కరుగుతున్న హిమానీ నదాలు
.

పర్యావరణ మార్పుల ప్రభావం (Global Warming Impact) పెరుగుతున్న ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉండదు. దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భూతాపం సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2020లో ఉత్తరార్ధగోళంలో సగటుతో పోలిస్తే 1.28 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. 141 ఏళ్ల చరిత్రలో అదే అత్యధికం. ఈ ప్రభావం (Effects of Global Warming) పర్యావరణంపై ప్రత్యక్షంగా కనబడింది. 2020 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కింది. తరచుగా వేడిగాలులు, తుపానులు సంభవించాయి. వేల ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడింది. ఇసుక తుపానులు, కార్చిచ్చులు విధ్వంసం సృష్టించాయి. బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మరి 1.5 డిగ్రీలకే ఇలా ఉంటే.. భూతాపం 3 డిగ్రీలకు పెరిగితే ఎలా (Global Warming Projections) ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తల మెదళ్లలో పుట్టింది. దీనిపై విస్తృతంగా పరిశోధన చేయగా.. వెలుగులోకి వచ్చిన అంశాలు విస్తుపోయే విధంగా ఉన్నాయి.

భీకర వరదలతో మునిగిన నగరం

భూతాపం 3 డిగ్రీలకు పెరిగితే...

  • వార్షికంగా సంభవించే వేడిగాలుల ఘటనలు 80 శాతం (Global Warming Facts) పెరుగుతాయి. 1981-2010 కాలంలో 5 శాతంతో పోలిస్తే.. ఇది చాలా ఎక్కువ. 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి గాలుల ఘటనలు 30 శాతం అధికంగా నమోదవుతాయి.
    ఎండిపోయిన నది
  • నదుల ద్వారా వరదలు సంభవించే అవకాశం ఏటా 2 శాతం పెరుగుతోంది. 1.5 డిగ్రీల వద్ద ఇది 2.4 శాతం, 3 డిగ్రీల వద్ద ఏకంగా 4 శాతం ఉండనుంది. 3 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కరవు పరిస్థితులు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.
  • భూతాపం 3 డిగ్రీలకు చేరితే తలెత్తే ప్రభావాలు యూకే వంటి దేశాల్లో అధికంగా ఉండనున్నాయి. ఏటా సంభవించే వేడిగాలుల ఘటనలు 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 65 శాతం, 3 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 90 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఏటా ఒకరోజు అధిక ఉష్ణోగ్రత ఒత్తిడి ఉండే అవకాశం 50 శాతం పెరుగుతుందని తేలింది.
    అడుగంటుతున్న నీటి వనరులు
  • పశ్చిమ ఇంగ్లాండ్​లో కరవు పరిస్థితులు 1.5 డిగ్రీల భూతాపం వద్ద 12 శాతం అధికంగా ఉండనున్నాయి. 3 శాతం వద్ద ఇది 16 శాతంగా ఉండే అవకాశం ఉంది.
    కార్చిచ్చుల విలయం

ఈ గణాంకాలపై కొంతవరకు అనిశ్చితి ఉన్నా.. భూతాపం ప్రభావం (Impact of Global Warming) ఊహించని స్థాయిలో ఉంటుందనేది మాత్రం విస్పష్టం. ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ.. ఈ ప్రభావం మరింత విస్తృతంగా ఉండనుంది. దీని వల్ల పడే ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలోకెల్లా నదీ వరదల ప్రమాదం దక్షిణాసియాలోనే అధికంగా (Global Warming Projections) ఉండనుంది. కరవు పరిస్థితులు ఆఫ్రికాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ప్రజల జీవనం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థలపై ఎంత ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయనే విషయంపై ఈ పరిణామాల తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా.. 3 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ప్రస్తుతంతో పోలిస్తే మరింత వినాశకర పరిస్థితులు ఉంటాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details