తెలంగాణ

telangana

Panjagutta girl murder: ఆ చిన్నారిని చంపింది కన్నతల్లే... ప్రియుడితో కలిసి కిరాతకంగా...

By

Published : Nov 13, 2021, 7:30 PM IST

నవమాసాలు మోసి జన్మనిచ్చిన కుమార్తెను ఓ కసాయి తల్లి(mother murder daughter) కడతేర్చింది. ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టింది. ఏమాత్రం బాధ లేకుండా... ఏమీ ఎరుగనట్టు నాలుగేళ్ల కూతురు మృతదేహాన్ని(4 years girl murdered in hyderabad) ఓ దుకాణం ముందు అనాథగా వదిలేసి పరారైంది. పది రోజులకు ఆమె చేసిన పాపం పండి.. పోలీసులకు దొరికి కటకటాలపాలైంది.

girl murder case reveled and mother murdered 4 years baby with lover help
girl murder case reveled and mother murdered 4 years baby with lover help

నాన్న దగ్గరికి తీసుకెళ్లమన్నందుకు కన్న కూతురిని కర్కషంగా కొట్టి చంపింది..

పేగు తెంచుకుని మరీ జీవం పోసిన తల్లి.. పిడిగుద్దులతో పేగులదిలేలా చిన్నారిని హింసించింది. ప్రాణం పణంగా పెట్టి జన్మనిచ్చిన ఆ అమ్మ.. బిడ్డ ప్రాణం పోయేలా పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుని మోజులో పడి.. కన్న ప్రేమను మరిచి కర్కషంగా(mother murder daughter) చంపేసింది. తన కూతురు తన చేతుల్లో చనిపోయిందన్న పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా.. మృతదేహాన్ని అనాథగా రోడ్డుపై పడేసి చేతులు దులుపుకోవాలనుకుంది. పిసిపిల్లను పొట్టనబెట్టుకున్న పాపం వారిని వదిలిపెట్టకుండా.. కటకటాలపాలు చేసింది. కలకలం రేపిన చిన్నారి హత్య కేసు(baby murder case) మిస్టరీని పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్​లోని మియాపూర్​కు చెందిన హీనీ బేగం, మహ్మద్‌ అహ్మద్‌ దంపతులకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. కూలీ పని, ఇళ్లలో పనిచేసుకుంటూ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్‌ దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి.. జైలు పాలయ్యాడు. అనంతరం.. పాతబస్తీ డబీర్‌పురాకు చెందిన షేక్‌ మహ్మద్‌ ఖాదర్‌తో హీనా బేగంకు పరిచయం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పిన ఖాదర్‌.. పిల్లలతో పాటు హీనాను ముంబాయి తీసుకువెళ్లాడు.

ప్రియుడు తనను రాణిలా చూసుకుంటాడు.. సకల సౌకర్యాలతో సుఖపెడతాడని.. అతడి వెంట వెళ్లిందా..? అంటే.. అక్కడ వారంతా కలిసి బిక్షం ఎత్తుకున్నారు. పిల్లలనూ వదిలిపెట్టకుండా వారితో కూడా బిక్షాటన చేయించారు. హీనా నాలుగేళ్ల చిన్న కూతురు బేబీ హీనాకు ఆడుకోవటం తప్ప అడుక్కోవటం ఏం తెలుసు..? బొమ్మలతో ఆడుకునే ఆ చిన్నారి చేత బలవంతంగా భిక్షాటన చేయిస్తుంటే.. అది ఇష్టం లేని నాలుగేళ్ల మోహక్‌.. తనను తండ్రి వద్దకు తీసుకువెళ్లాలని మారాం చేసింది.

ఇది నచ్చని హీనా, ఆమె ప్రియుడు చిన్నారి అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారు. బేబీ మెహక్‌ను కడుపులో పిడి గుద్దులు కురిపించి, కాళ్లతో తన్ని శారీరకంగా హింసించారు. తట్టుకోలేని చిన్నారి తల్లడిల్లిపోయింది. బాధ భరించలేక చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. హీనా, ఖాదర్‌ కలిసి చిన్నారిని బస్సులో హైదరాబాద్‌ తీసుకువచ్చారు. అప్పటికే పాప మృతి చెందింది.

చిన్నారి హత్య తమ మీదికి రాకుండా ఉండాలని తలచిన ఆ కర్కష తల్లి, ఖాదర్​.. మెహక్‌ మృతదేహాన్ని ఆటోలో పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలోని ఒక దుకాణం ముందు వదిలేసి పరారయ్యారు. పాప మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడున్న అన్ని సీసీ కెమారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురిని విచారించారు. పది రోజుల దర్యాప్తు తర్వాత.. అభం శుభం తెలియని చిన్నారిని చంపి తప్పించుకుందామనుకున్న ఇద్దరు దుర్మార్గులను... పోలీసులు జూబ్లీబస్టేషన్‌ వద్ద అరెస్టు చేశారు.

నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details