ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుచార్ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి Char Dham Yatra: ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లి ఇప్పటివరకు 31 మంది భక్తులు మరణించారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల వీరు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్షాకు రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలుRevanth Questions to Amit Shah: మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు. 'ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృభాషను మరవొద్దు' Vice President in Graduation Ceremony: మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవొద్దని స్పష్టం చేశారు. 'ఐదేళ్లు కరవొచ్చినా తాగునీటి కొరత ఉండదు'KTR laid Foundation stone for Sunkishala Project: ఐదేళ్లు కరవు వచ్చినా... హైదరాబాద్లో తాగునీటికి ఇబ్బంది ఉండదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్టెక్ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరం ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఉపయోగపడుతుందన్నారు.'తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెడతారా..?' ఖమ్మంలో ధాన్యం కొనుగోళ్లపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గన్నీ సంచులు సరిపడా ఉన్నాయని మంత్రి తెలిపారు. తరుగు పేరుతో రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు.'పిల్ల దొరికినా పెళ్లి చేయట్లేదు'.. Dwarf person marriage: పిల్ల దొరికినా పెళ్లి చేయటం లేదంటూ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉత్తర్ప్రదేశ్ శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్ మన్సూరీ. పెళ్లి కావట్లేదని ఏడాది క్రితం వార్తల్లో నిలవగా.. ఓ యువతి ముందుకొచ్చింది. అయితే, ఏడాదిగా వివాహం చేయకపోవటంపై విసుగు చెందిన అజీమ్.. ఇప్పుడు పోలీస్ స్టేషన్కు వెళ్లారు.ట్రెండ్ మార్చిన సాధువులు.. Sadhu saints: సాధువులు ట్రెండ్ మార్చారు. మఠాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లో అఖిల భారతీయ అఖాడా పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ బెర్తు కష్టమేనా?IPL 2022 RCB Playoffs: ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి ఏ స్థానంలో నిలుస్తుందో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ సారి బెంగళూరు జట్టుతో సహా మిగతా టీమ్ల పరిస్థితి ఇప్పుడెలా ఉంది తెలుసుకుందాం..'కేజీఎఫ్ 3' షురూ అయ్యేది అప్పుడే.. కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. కన్నడ రాకింగ్ యశ్, బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటించనున్న కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..అక్కడ విజయ్తో కలిసి చిల్ కొట్టా: అనన్య పాండేవిజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'లైగర్'తో తెలుగువారికి పరిచయమవుతున్నారు బాలీవుడ్ నటి అనన్య పాండే. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.