తెలంగాణ

telangana

ఇప్పటి వరకు రూ.120 కోట్లు పంపిణీ చేశాం: సోమేశ్ కుమార్

By

Published : Oct 25, 2020, 3:35 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​.. అధికారులు, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. వరదల్లో బాధితులకు సాయం అందించిన అధికారులకు... దుర్గాదేవి ప్రత్యేకంగా ఆశీర్వాదం ఇస్తుందని, ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

cs somesh kumar on dasara
దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎస్​ సోమేశ్​ కుమార్​

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన 80 వేల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇప్పటి వరకు రూ.120 కోట్లు పంపిణీ చేశామన్నారు. సహకరించిన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్​ కుమార్​, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్​కుమార్‌, సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్‌ శ్వేతా మహంతిని సీఎస్​ అభినందించారు. మీ కృషి, కరుణకు.. దుర్గాదేవి ప్రత్యేకంగా ఆశీర్వాదం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి:సకల సృష్టికి మూలం విజయ విలాసిని!

ABOUT THE AUTHOR

...view details