తెలంగాణ

telangana

nandamuri ramakrishna : 'మరోసారి హద్దు మీరి.. మా సహనాన్ని పరీక్షించొద్దు'

By

Published : Nov 20, 2021, 1:36 PM IST

మా కుటుంబం జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టం
మా కుటుంబం జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టం

ఏపీ అసెంబ్లీ(AP assembly news 2021)లో జరిగిన పరిణామాలపై నందమూరి రామకృష్ణ(nandamuri ramakrishna news) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని హెచ్చరించారు. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దని సూచించారు.

మా కుటుంబం జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టం

ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోందని నందమూరి రామకృష్ణ(nandamuri ramakrishna) ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడేళ్ల నుంచి చూస్తున్నామని.. చాలా బాధగా ఉందని అన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదని వాపోయారు. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరి ప్రవర్తించారని .. వ్యక్తిగత విషయాల జోలికి రావొద్దని హెచ్చరించారు.

"రాజకీయ పరిణామాలు చూస్తే బాధేస్తోంది. ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారు. రాజకీయంగా ఉంటే... రాజకీయంగానే చూసుకోవాలి. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. మేం కూడా గాజులు తొడుక్కుని కూర్చోలేదు. మా నాన్నగారు, తెదేపా క్రమశిక్షణ నేర్పింది. మా సహనాన్ని పరీక్షించొద్దు. మీరు హద్దు మీరారు.. మేమూ హద్దు మీరుతాం."

- నందమూరి రామకృష్ణ

చంద్రబాబు అలా బాధ పడుతుంటే చూడలేకపోయామని లోకేశ్వరి ఆవేదన చెందారు. ప్రజలు వైకాపా నుంచి ఎంతో ఆశించారని.. కానీ ఇక్కడ జరిగేదంతా వేరే ఉందని అన్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details