తెలంగాణ

telangana

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 223 మరణాలు

By

Published : Mar 2, 2022, 9:28 AM IST

Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 7,554 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మరో 223 మంది మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 13,37,398 కేసులు వెలుగుచూశాయి.

Covid virus cases
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Corona cases in India: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. అయితే, క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 7,554 మందికి మహమ్మారి సోకగా.. 14,123 మంది కోలుకున్నారు. 223 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 42,938,599
  • మొత్తం మరణాలు: 5,14,246
  • యాక్టివ్​ కేసులు: 85,680
  • కోలుకున్నవారు: 4,23,38,673

Vaccination in india:

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 8,55,862 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,79,92,977కు చేరింది.

World Corona cases:

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 13,37,398 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,88,14,552కి.. మరణాలు 59,83,814కి చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్ దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో కొత్తగా 150,565 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 275 మంది కరోనాకు బలయ్యారు.
  • అమెరికాలో కొత్తగా 41,899 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 1,451 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో తాజాగా 97,333 కరోనా కేసులు నమోదయ్యాయి. 786 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 274 మంది చనిపోయారు. 23,545 కేసులు వెలుగుచూశాయి.
  • ఫ్రాన్స్​లో కరోనా మహమ్మారి ధాటికి మరో 209 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 79,794మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ABOUT THE AUTHOR

...view details