తెలంగాణ

telangana

వేసవి సెలవుల తర్వాతే కాళేశ్వరం పిటిషన్ల విచారణ : హైకోర్టు - hc on kaleshwaram project

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 10:13 PM IST

HC on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన వివిధ పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు, ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై వివిధ సంస్థల దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఎటువంటి ఉత్తర్వులను ఇవ్వలేమని స్పష్టం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి, నిర్మాణలోపాలు మేడిగడ్డ కుంగుబాటు తదితరాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను, వేసవి సెలవుల తరువాత చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Investigation on Kaleshwaram
HC on Kaleshwaram Project

HC on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి ఆరోపణలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA), విజిలెన్స్ విచారణతో పాటు న్యాయ విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్​ను నియమించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నిర్మాణలోపాలు మేడిగడ్డ కుంగుబాటు తదితరాలపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను, వేసవి సెలవుల తరువాత చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

'కాళేశ్వరం' కేసు సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్​ పిటిషన్​ - విచారణ ఏప్రిల్​ 2కు వాయిదా వేసిన హైకోర్టు - TS High Court On KA Paul Petition

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి నిర్మాణాలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ. పాల్(KA Paul), న్యాయవాది బి రామ్మోహన్ రెడ్డి, వ్యక్తిగత హోదాలో ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, న్యాయవాది విశ్వనాథరెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ కె.ఎ.పాల్ వాదనలు వినిపిస్తూ కాగ్ రిపోర్టు ఆధారంగా పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.

Investigation on Kaleshwaram :కేటాయించిన నిధుల్లో కేవలం 52 శాతం మాత్రమే వినియోగించినట్లు కాగ్(CAG) పేర్కొందన్నారు. భారీ అవినీతి జరిగిందని 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని, సీబీఐ దర్యాప్తు ప్రారంబించేలా ఆదేశాలివ్వాలనీ కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పిటిషన్​పై ఏం ఉత్తర్వులు ఇవ్వాలన్న దానిపై సలహాలు అవసరం లేదంది. ఉత్తర్యులు ఇవ్వడానికి మీ అనుమతి అవసరంలేదని వాధనలు మాత్రమే వినిపించాలని హితవు పలికింది.

ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని చెబుతుండగా, సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని అసలు ప్రభుత్వ వాదన వినకుండా ఏకపక్షంగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఉత్తర్వుకు ఇవ్వాలా అని ప్రశ్నించింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం కింద, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఏజీ సుదర్శన్ రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఇదే అంశంపై గతంలో దాఖలైన పిటిషన్లపై మార్చి 4న ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొంది.

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ గత అక్టోబరు 24, 25 తేదీల్లో సందర్శించి ప్రాథమిక విచారణ నిర్వహించిందని, పూర్తిస్థాయి విదారణ చేపట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని పేర్కొంది. దీంతో పాటు విజిలెన్స్ కమిషన్ విచారణ కొనసాగుతోందన్న ప్రభుత్వ వాదన నేపథ్యంలో, విచారణను 4 నెలలకు వాయిదా వేశామని పేర్కొంది. ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని ఏజీ రాతపూర్వక వివరణ అందజేశారంది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక రూపకల్పనలో నిర్లక్ష్యం, అవకతవకలు లోటుపాట్లపై విచారణ జరపాలని నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఆదనపు సమయం పొడిగింపు పనులు పూర్తయినట్లు ధ్రువీకరించడం.,బ్యాంకు వారంటీలను విడుదల తదితరాల్లో కాంట్రాక్టర్లకు సాయం చేసిన అధికారుల గుర్తింపు, బాధ్యులైన అధికారుల గుర్తింపు దీనిపై పడే ఆర్థిక ప్రభావం తదితులపై కమిషన్ విచారణ జరుగుతోందన్నారు.

అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్లలో ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని స్పష్టం చేస్తూ, విచారణను వేసవి సెలవుల తరువాత వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. దీనిపై ఇతర పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయబోగా, అన్నింటికీ ఇదే అదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

'ప్రజాప్రయోజనం కన్నా రాజకీయ, ప్రచార ప్రయోజనాలే కనిపిస్తున్నాయి' - Kaleshwaram Project Case Update

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఎన్‌డీఎస్‌ఏ అధ్యయనం - సీకెంట్‌ పైల్‌ పద్ధతికే మొగ్గు ఎందుకు? - NDSA Committee On Kaleshwaram

ABOUT THE AUTHOR

...view details