తెలంగాణ

telangana

గల్ఫ్ బాధితులకు కేటీఆర్ పరామర్శ​ - రాష్ట్రంలోనే ఉపాధి అందిపుచ్చుకోవాలని సూచన

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 7:50 PM IST

KTR Visited Sircilla Prisoners at Peddur : తెలంగాణలో అపార అవకాశాలున్నాయని, యువత విదేశాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్​ సూచించారు. ఇవాళ సిరిసిల్ల జిల్లాలోని ఏళ్లపాటు దుబాయ్ జైళ్లలో శిక్ష అనుభవించిన బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్​ దేశ బాధితుల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు.

Ktr About Employment in Telangana
KTR Visited Sircilla Prisoners at Peddur

KTR Visited Sircilla Prisoners at Peddur : ఏళ్లపాటు దుబాయ్ జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలై స్వస్థలాలకు చేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామస్థులు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల కుటుంబాలను బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ (KTR) పరామర్శించారు. గల్ఫ్​ బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు. లక్షల కుటుంబాలు రాష్ట్రం నుంచి వలస వెళ్లి గల్ఫ్​ దేశాల్లో పని చేస్తున్నారని, తెలంగాణలో అపార అవకాశాలు ఉండగా విదేశీ బాట పట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు 18 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన బాధితులే ఉదాహరణ అని అన్నారు.

సిరిసిల్ల స్థానికుల ద్వారా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆ సమయంలో అధికారంలో లేకున్నా, నేపాల్ వరకు వెళ్లి 15 లక్షల రూపాయలు అందించామని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. కానీ దుబాయ్(Dubai) చట్టాల్లో మార్పుల వల్ల అప్పుడు వీరి విడుదల సాధ్యం కాలేదన్నారు. ఇంకా ఏడేళ్ల శిక్షాకాలం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. వీరికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్​ సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి చాలా మంది ఇక్కడ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని, రాష్ట్రంలోని యువకులు గల్ఫ్ బాట పట్టవద్దని, వెళ్లేవారు ఇక్కడే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని సంతోషంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.

KTR About Medigadda Project : ఇదికాగా మరోవైపు ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు మేడిగడ్డ బ్యారేజీకు వెళ్తామని ఈ నెల 27న తెలంగాణ భవన్​లో కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ చలో మేడిగడ్డ(Chalo Medigadda) కార్యక్రమం ఉంటుందని, 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో చలో మేడిగడ్డ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తొలి రోజు కాళేశ్వరం వెళ్తామని, విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామని తెలిపారు.

'దశాబ్దాలుగా ఇక్కడి నుంచి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్య, పిల్లలను విడిచిపెట్టి గల్ఫ్​ దేశాల్లో, ఆ ఏడారిలో మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ అక్కడ పని చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా, ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయం, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఆ క్రమంలో అక్కడ ఇబ్బందుల పడుతున్న సోదరులకు, ఇవాళ సిరిసిల్ల గల్ఫ్​ బాధితులే గొప్ప ఉదాహరణ.'- కేటీఆర్​, బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

గల్ఫ్ బాధితుల కుటుంబాలను పరామర్శించిన కేటీఆర్​ - రాష్ట్రంలోనే ఉపాధి అందిపుచ్చుకోవాలని సూచన

ఆకాశమే మీ లక్ష్యమైతే - అక్కడికి తీసుకెళ్లడానికి మేం రాకెట్​తో సిద్ధం : సీఎం రేవంత్​ రెడ్డి

త్వరలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details