దొంగతనం నెపంతో యువకుడి దారుణ హత్య, కరెంట్​ స్తంభానికి కట్టేసి మరీ

By

Published : Aug 21, 2022, 11:12 AM IST

thumbnail

హరియాణా సోనీపత్​లో దారుణం జరిగింది. దొంగతనం చేశాడన్న కారణంతో ఓ యువకుడిని కొట్టి చంపారు స్థానికులు. ఓ మొబైల్​ షాపులో ఫోన్​ చోరీ చేశాడని అనుమానించిన స్థానికులు యువకుడిని కరెంట్​ స్తంభానికి కట్టేసి కొట్టారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన యువకుడు.. కాసేపటికి మరణించాడు. మృతుడిని ఝండ్​పుర్​ గ్రామానికి చెందిన అశోక్​గా గుర్తించారు. మరో ఘటనలోనూ దొంగతనం నెపంతో యువకుడిని కొట్టారు ఐదుగురు దుండగులు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​లో జరిగింది. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.