సమాజ్​వాదీ నేత కారును ఢీకొట్టిన ట్రక్కు... 500 మీటర్లు లాక్కెళ్లి.. చివరకు..

By

Published : Aug 8, 2022, 10:23 AM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాజ్​వాదీ పార్టీ మెయిన్​పురి జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టి.. 500 మీటర్లు లాక్కెళ్లింది. అయితే దేవేంద్ర త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెయిన్​పురి సదర్​ కొత్వాలి పోలీస్ స్టేషన్​లో దేవేంద్ర సింగ్ ఫిర్యాదు చేయగా ట్రక్కు డ్రైవర్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని మెయిన్​పురి ఎస్పీ కమలేశ్ దీక్షిత్ తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.