హైదరాబాద్​లో ప్రధాని మోదీ రోడ్ షో - జన సంద్రమైన ఆర్టీసీ క్రాస్​ రోడ్ పరిసరాలు

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 6:36 PM IST

thumbnail

PM Modi Road Show in Hyderabad : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ప్రారంభమైన రోడ్ షో.. నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ చౌరస్తాలోని వీర సావర్కర్ విగ్రహం వరకు సాగింది. 2 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్​ షోలో.. ప్రధాని మోదీని చూసేందుకు బీజేపీ, జనసేన, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 

మోదీని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్​ రోడ్​ నుంచి కాచిగూడ వరకు పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. రోడ్ షోను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ముందుగానే ఆ రూట్లలో బస్సులను డైవర్ట్ చేసింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్ షోకు 2 గంటల ముందుగానే ట్రాఫిక్ నిలిపివేశారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదని మెట్రో అధికారులు ముందుగానే ప్రకటించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.