Gutta Sukhender Reddy Latest Comments : 'రేవంత్​ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్​రెడ్డిలకు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా?'

By

Published : Jul 14, 2023, 3:41 PM IST

thumbnail

Gutta Sukhender Reddy fire on Revanth Reddy : ముఖ్యమంత్రి కేసీఆర్​పై 24 గంటల ఉచిత కరెంట్​ విషయంలో అవినీతి జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి చేసిన ఆరోపణలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్​ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్​రెడ్డిలకు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ ఎప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో ఎప్పుడైనా పంట పొలాలు నీరు లేకుండా ఉన్నాయా? అని ప్రశ్నించారు. కరెంట్​ కొనుగోలు విషయంలో కుంభకోణం జరుగుతున్నదని.. రేవంత్​ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్​ను ప్రభుత్వరంగ సంస్థ ఎన్​ఎల్​డీసీ ద్వారా తీసుకుంటున్నామని.. మరి కుంభకోణం ఎలా అవుతుందని నిలదీశారు. యాదాద్రి పవర్​ ప్లాంట్​​కు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని.. బీహెచ్​ఈఎల్​ ద్వారానే నిర్మిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని ధ్వజమెత్తారు. బషీర్ బాగ్ కాల్పులకి కేసీఆర్ కారణం అంటున్న రేవంత్ రెడ్డి మాటల్లో నిజం లేదని అన్నారు. ఆ సమయంలో రేవంత్​ ఎక్కడ ఉన్నారో తెలియదని అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.