బస్సులో మంటలు చెలరేగి నిద్రలోనే డ్రైవర్ కండక్టర్​ సజీవదహనం

By

Published : Oct 25, 2022, 9:11 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

ఝార్ఖండ్ రాంచీలోని ఖాడ్​గఢ్​ బస్టాండ్​లో​ ఘోరం జరిగింది. దేవునికి పెట్టిన దీపం అంటుకుని బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో నిద్రిస్తున్న డ్రైవర్ మదన్, కండక్టర్ ఇబ్రహీం సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో పూర్తిగా కాలిపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటన మంగళవారం వేకువజామున ఒంటిగంటకు జరిగిందని అధికారులు తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.