తాగుబోతు ప్రిన్సిపల్ మాకొద్దంటూ ఉపాధ్యాయుల ధర్నా ​

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 4:19 PM IST

thumbnail

Colleagues Demand Removal Of Principal In Nirmal District : బుతుపురాణాల ప్రిన్సిపాల్, తాగుబోతు ప్రిన్సిపల్ మాకొద్దంటూ సహోద్యోగులు ధర్నాకు దిగిన ఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో చోటు చేసుకుంది. ముధోల్ కేంద్రంలోని టీఎస్​డబ్ల్యూఆర్ పాఠశాల జూనియర్ కాలేజ్ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రధాన ద్వారం ముందు ధర్నాకు కూర్చున్నారు. ప్రిన్సిపల్ ఎండి రఫిద్దున్ పరుష పదజాలంతో సంభాషించడం, ప్రతిరోజు ఉపాధ్యాయులే టార్గెట్​గా వ్యవహరించడం ఇబ్బందిగా ఉందంటూ తోటి ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Colleagues Demand Removal Of Principal In Mudhole : ఇక్కడ విధులు సక్రమంగా నిర్వర్తించలేక పోతున్నామని, తమ నైనా మార్చాలని లేదంటే ప్రిన్సిపల్ రఫిద్దున్​ను మార్చాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్​పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు సైతం ఫిర్యాదు చేశామని, వారు వెంటనే స్పందించి ప్రిన్సిపాల్​ను బదిలీ చేయాలని కోరారు. ఈ విషయంపై ప్రిన్సిపల్​ను సంప్రదించగా తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దాటవేస్తూ మధ్యలోనే వెళ్లిపోయారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.